తండ్రి, కొడుకులు తట్ట, బుట్టా సద్దుకుని హైదరాబాద్ పోండి : రోజా సెటైర్లు

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లపై వైసీపీ పార్టీ ఎమ్యెల్యే రోజా సెల్వమణి షాకింగ్ కామెంట్స్ చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో తండ్రి, కొడుకులు తట్ట, బుట్టా సద్దుకుని హైదరాబాదు పోవాలని చురకలు అంటించారు రోజా. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా.. వార్ వన్ సైడే…ఏపీ ప్రజలు ఎప్పుడు.. జగన్ మోహన్ రెడ్డి వైపే ఉంటారని ఆమె పేర్కొన్నారు.

నలబై ఏళ్ళు ఇండ్రస్టీ అయినా చంద్రబాబును కుప్పం ప్రజలు తరిమి కొట్టారని చురకలు అంటించారు రోజా. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును…హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని.. కుప్పం ప్రజలు జగన్ వెంటనే ఉన్నారని తెలిపారు. డిల్లీ చక్రం తిప్పుతాననే చంద్రబాబు…. కుప్పం మున్సిపాలిటీలు బోక్క బోర్ల పడ్డారని ఎద్దేవా చేశారు రోజా. వైకాపాను గెలిపించిన కుప్పం ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news