రాములోరి కళ్యాణానికి రావెందుకు దొర..? – విజయశాంతి

-

 

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి నేత విజయశాంతి మరోసారి నిప్పులు చెరిగింది. రాములోరి కళ్యాణానికి రావెందుకు దొర..? అని ప్రశ్నించారు విజయశాంతి. భద్రాద్రి రామయ్య పై పట్టింపు లేదా…? రామయ్యకు తలంబ్రాలు ఎందుకు ఇవ్వవు అని నిలదీశారు. మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేశారు విజయశాంతి.

 

ఎంతో మంది తెలంగాణ బిడ్డలు గుజరాత్‌లో లక్షల సంఖ్యల పనిచేస్తున్నరు కదా ఐటీ మంత్రి కేటీఆర్ గారూ… పదే పదే ఒక గుజరాత్ పేరు తీసి విమర్శలు చెయ్యడం… అక్కడెక్కడో గుజరాత్‌లో బతుకుతున్న తెలంగాణ ప్రజలకెంత ఇబ్బందికర పరిస్థితి అని మండిపడ్డారు.అన్ని రాష్ట్రాల నుండీ పెట్టుబడుల కోసం ప్రయత్నించే మంత్రిగా మీకు కూడా ఇదెంతవరకూ సమంజసం?గుజరాత్ అనే రాష్ట్రంపై ఇంత అక్కసు చూపితే… మీ తండ్రి గారి భారత రాష్ట్ర సమితి ఎట్ల జాతీయ పార్టీ ఐతదో.. కొంత సమంజసంగా మీ పార్టీ లో మాట్లాడే ఒకే వ్యక్తిగా మీరే చెప్పాలన్నారు రాములమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news