పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యల కేసును వాయిదా వేసిన సివిల్ కోర్ట్ !

-

గత కొంతకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు లో వారాహి యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వలంటీర్ల పై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం చెందిన వాలంటీర్లు నిరసనలు తెలిపారు. కానీ తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు మహిళా వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పై కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విజయవాడ లోని సిటీ సివిల్ కోర్ట్ టేక్ అప్ చేసింది. అయితే కేసును కోర్ట్ విచారణలో భాగంగా ఇప్పటికి తెలుస్తున్న సమాచారం ప్రకారం వలంటీర్ల స్టేటుమెంట్ ను రికార్డు చేసుకున్నారు. ఈ రోజు సాక్షుల చెప్పిన విషయాలను సైతం న్యాయస్థానం రికార్డ్ చేసింది. కానీ విచారణను కొనసాగించకుండా వాయిదా వేయడం జరిగింది. మరి ఈ కేసు ఎప్పటికి ఒక కొలిక్కి వస్తుందో అన్నది తెలియాల్సి ఉంది.

కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో మళ్ళీ ఈ కేసులో పవన్ ఏమైనా ఇరుక్కుంటాడా అన్నది కొందరి రాజకీయ ప్రముఖుల అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Latest news