Virat Kohli : తొలి టెస్ట్ కోసం సౌత్ ఆఫ్రికా చేరుకున్న కింగ్ కోహ్లీ

-

ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వచ్చిన కింగ్ కోహ్లీ ప్రస్తుతం తొలి టెస్టు ఆడేందుకు సౌత్ ఆఫ్రికా కు తిరిగి వెళ్ళాడు. డిసెంబర్ 26వ తేదీన సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. తొలుత లండన్ వెళ్లిన కోహ్లీ ఎప్పటికప్పుడు తన ప్రయాణానికి సంబంధించిన వివరాలను బీసీసీఐకి తెలియ పరుస్తున్నారు. లండన్ నుంచి సౌత్ ఆఫ్రికా కు వెళ్లిన కోహ్లీ నెట్స్ లోనే సాధన చేస్తున్నాడని …. ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొనడం లేదని బీసీసీఐ వెల్లడించింది.

టీం మేనేజ్మెంట్ కి అతని ప్రణాళికలు ,షెడ్యూల్ పై పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది. కోహ్లీ లండన్ ట్రిప్ కూడా ప్లాన్ ప్రకారం జరిగిందని సీనియర్ అధికారి ఒకరు ఇంగ్లీష్ మీడియాకు తెలియజేశారు.

 

కింగ్ కోహ్లీ డిసెంబర్ 15 న దక్షిణాఫ్రికా చేరుకొని అక్కడ నాలుగు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నాడు. డిసెంబర్ 19న లండన్ వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్లీ దక్షిణాఫ్రికా కి తిరిగి వచ్చారు. సెంచురీయన్ వేదికగా జరగబోయే టెస్ట్ మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ సెషన్ లో ఆడుతాడు అని సదరు అధికారి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news