సాయిధరమ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘విరూపాక్ష‌’ టీజర్ కు ముహుర్తం ఫిక్స్

-

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో అయితే తన కెరీర్ లో 15వ సినిమా మంచి ప్రతిష్టాత్మకంగా మారగా, ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు కార్తీక్ వర్మ తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటిస్తుండగా మేకర్స్ అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇప్పుడు రివిల్ చేశారు. ఈ సినిమా టీజర్‌ రిలీజ్ డేట్‌ ను కూడా అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా టీజర్‌ ను మార్చి 1 వ తేదీన రిలీజ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఓ మోషన్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. కాగా ఈ సినిమాను ఏప్రిల్‌ 21న రిలీజ్‌ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news