ఆ ప్రమాదంతో చావును దగ్గర నుండి చూశాను : హీరో విశాల్

-

తమిళ మరియు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన విశాల్ లేటెస్ట్ గా మార్క్ ఆంథోనీ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక మూవీ యూనిట్ అంతా కూడా ప్రమోషన్ చేయడంలో తమ దృష్టిని కేంద్రీకరించింది, అందులో భాగంగా విశాల్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని షూటింగ్ లో తనకు జరగబోయింది భారీ ప్రమాదాన్ని గురించి వివరించాడు. విశాల్ మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో నేను ఒక ఫైట్ సీన్ చిత్రికరణ సమయంలో పక్కన కూర్చుని ఉన్నాను.. సడెన్ గా నా వైపు ఒక పెద్ద ట్రక్కు వస్తూ ఉంది, కొంచెం దూరంలో ఉండగా చూసి ఆ పెను ప్రమాదం నుండి తప్పించుకున్నాను అంటూ ఊపిరి పీల్చుకున్నాడు విశాల్.

ఆ సమయం నాకు ఎంతో కఠినమైనదని మరియు చావును ఎంతో దగ్గరగా చూశానని చెప్పుకొచ్చాడు విశాల్. ఇక సినిమా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news