కార్తీకమాసంలో ఈ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే!

-

కార్తీకమాసం అంటే మహాశివుణికి చాలా ఇష్టం. ఈ మాసంలో పుణ్యక్షేత్రాలైన పంచారామాలు దర్శిస్తే శ్రేష్టమని చెప్తారు. ఎప్పుడో వెళ్లేకంటే కార్తీకమాసంలో ఈ పంచారామాలను దర్శించుకుంటే మంచిది. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై 5 ప్రదేశములలో పడింది. ఆ 5 క్షేత్రములే పంచారామాలుగా ప్రసిద్ధిగాంచాయని పురాణం చెబుతున్నది. మరి ఆ పుణ్యక్షేత్రాలేంటో చూద్దాం.

ద్రాక్షారామం :
పంచారామాలలో మొదటిదిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుతున్న పవిత్ర క్షేత్రం ద్రాక్షారామం. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. ఈ ఆలయంలో మహాలింగం ఎత్తు సుమారు 60 అడుగులు. గర్భాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. మహాలింగానికి అర్చకులు పై అంతస్తు నుంచి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడి శివలింగం సగం నలుపు, సగం తెలుపు వర్ణంలో ఉంటుంది. దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రదేశం కావడంతో దీనికి ద్రాక్షారామం పేరు వచ్చిందని చెబుతుంటారు. ద్రాక్షారామం పార్వతీదేవి జన్మస్థలమని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీచక్రస్థిత మాణిక్యాంబదేవిగా వివాజిల్లుతుంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఇదీ ఒకటి. ద్రాక్షారామము భోగానికి, మోక్షానికి, పావనానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.

అమరామం : పంచారామాలలో అమరావతి రెండవది. ఇది గుంటూరుజిల్లాలో కృష్ణానది తీరంలో ఉంది. నవ్యాంధ్రకు భవ్యరాజధానిగా నిర్మితమువుతున్న అమరావతికి పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ స్వామివారు అమరేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమరేశ్వర లింగం ఎత్తు 35 అడుగులు. గర్భాలయంలో 15 అడుగుల లింగం కనిపిస్తుంది. మిగతా 20 అడుగులు భూమిలోపల ఉందని చెబుతారు. పై అంతస్తు ఎక్కి అభిషేకం పూజలు చేయాలి. దేవాలయ ప్రాంగణంలో 108 శివలింగములు కలవు. అమ్మవారికి రాజ్యలక్ష్మి బాల చాముండిక అను పేరు కూడా కలదు. ఇక్కడ ఏకాదశ రుద్రాభిషేకం ప్రత్యేకత. ఈ లింగాన్ని దేవతల రాజయిన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం. అందుకే ఈ క్షేత్రానికి అమరావతి అనే పేరు వచ్చిందంటారు. లింగం పెరుగుటచే చీల కొట్టారని అంతట పెరుగుదల ఆగిపోయిందని చెబుతారు. చీల కొట్టినప్పుడు రక్తం ధారగా కారినట్లు లింగంపై కన్పిస్తుంది.

క్షీరారామం : క్షీరారామం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. ఈ క్షేత్రం నరసాపురానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ మహాలింగాన్ని త్రేతాయుగంలో సీతారాములు ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ శివలింగం పాలవలె శ్వేతవర్ణంలో కనిపిస్తుంటుంది. లింగంపైభాగం మొనదేలి ఉండడం వల్ల స్వామివారిని కొవ్వు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ఈశాన్య ముఖస్వరూపుడుగా దర్శనమిస్తాడు. క్షీరారామానికి ఆ పేరు రావడం వెనుక ఓ పౌరానిక గాథ ప్రచారంలో ఉంది. కౌశిక ముని కుమారుడు ఉపమన్యుడు శివుడిని నిత్యాభిషేకానికి కావాల్సిన క్షీరాన్ని కోరాడట. పరమేవ్వరుడు స్వయంగా క్షీరపుష్కరిణిని అనుగ్రమించి క్షీరసముద్రం నుంచి పుష్కరిణికి పాలు స్రవించేలా చేశాడట. పరమేశ్వరుడు స్వయంగా క్షీరపుష్కరిణికి పాలు స్రవించేలా చేశాడట. అలా ఈక్షేత్రం క్షీరారామంగా పేరొందింది. కాలకరమంలో పాలకొల్లుగా మారింది. ఇక్కడ 9 అంతస్తులతో నిర్మించిన 125 అడుగుల ఆలయ గోపురం అపురూప శిల్పసంపదతో విశేషంగా ఆకట్టుకుంటుంది. పార్వతి పరమేశ్వరులు, లక్ష్మి జనార్దనులు, సరస్వతి బ్రాహ్మలు ఉన్నందున ఈ దేవాలయమునకు త్రిమూర్త్యాలయమం అని పేరు. దీనికి హరిహర క్షేత్రమని పిలుస్తారు. లింగం తెలుపు రంగులో ఉంటుంది. ఇచట లింగంను దర్శించిన వారికి దారిద్య్ర బాధ కలగదని ప్రతీతి.

సామరామం : పంచారామాల్లో సోమారామం నాల్గవది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని గునుపూడిలో ఉంటుంది. ఇక్కడి స్వామివరాఇని ఉమాసోమేశ్వరునిగా పిలుస్తారు. ఈ శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం అమావాస్య నాటికి గోధుమరంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేనాటికి ధవళకాంతులీనుతుంది. సోమేశ్వర లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం మూలానే ఇలాంటి ప్రత్యేకత సంతరించుకుందని చెబుతుంటారు. సోముడు ప్రతిష్ఠించిన లింగం ఉండడం చేత ఈ క్షేత్రానికి సోమారామం అన్న పేరు స్థిరపడింది. ఈ లింగమును ప్రార్థించిన వారికి సర్వ వ్యాధులు తొలుగునని పంచ మహాపాపములు హరిస్తాయని నమ్మకం.

కుమారారామం : పంచారామాల్లో చివరిది కుమారారామం. ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్టించడం వల్ల ఈ క్షేత్రానికి కుమారరామం అన్న పేరు వచ్చింది. చాళుక్య రాజులలో ఒకడగు భీమునికి రాజధానికిగా ఉండుటచే ఈ ప్రాంతమును భీమవరుమని పేరు. శివుడు చాళుక్య భీమేశ్వరుడు, శివ కుమారుడయిన కుమారస్వామిచే పేజలందుకున్నది కావున కుమారారమమని పేరు వచ్చింది. దీనిని స్కంధరామమమని కూడా అంటారు. అమ్మవారు శ్యామల దేవి. 14 అడుగుల ఎత్తున భీమేశ్వరలింగం భక్తులకు దర్శనమిస్తుంది. రెండతస్తుల మంటపం గల గర్భాలయం ప్రత్యే ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు బాలతిత్రపురసుందరిగా పూజలు అందుకుంటున్నది.

Read more RELATED
Recommended to you

Latest news