విశాఖకు రైల్వే జోన్… కేంద్రం ప్రకటన..!

-

చాలా ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ కు ఎట్టకేలకు మోక్షం లభించింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. ఈ జోన్ లో గుంటూరు విజయవాడ గుంతకల్లు డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ లో ఒక భాగం ఉండనున్నాయి.

టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మార్చి 1 న ప్రధాని వైజాగ్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. విశాఖకు కొత్త రైల్వే జోన్ ఇవ్వడం పై ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక తీరినట్లయింది. అంతే కాదు గత నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటం కూడా ఫలించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version