ప్రాణహాని ఉందంటూ కోర్టు మెట్లెక్కిన వీకే నరేష్..!

-

వీకే నరేష్ ఎప్పటికప్పుడు వ్యక్తిగత విషయాలపై వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోని మరొకసారి తన భార్య రమ్య రఘుపతి పై మరో షాకింగ్ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం నరేష్, రమ్య రఘుపతి ఎపిసోడ్లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు బయటపడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ.. వినోధాన్ని కూడా పంచుతున్నాయి. వీరి మధ్య గొడవలు డైలీ సీరియల్ లా అనిపిస్తున్నాయి అంటూ చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం నరేష్.. పవిత్ర లోకేష్ తో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవ్వడం వల్లే ఆయన మూడో భార్య రమ్య రఘుపతి వెలుగులోకి వచ్చి ఆయనపై పలు ఆరోపణలు చేస్తోంది.

రమ్యతో తనకు ప్రాణహాని ఉంది అంటూ నరేష్ కోర్టును ఆశ్రయించారు.కర్ణాటక రౌడీ రాకేష్ శెట్టి తో రేక్కీ చేయించింది అని తనను చంపేందుకు ఇంటి దగ్గరకు వ్యక్తులను పంపించింది అంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదంతా కృష్ణ మరణించినప్పుడే జరిగింది అంటూ చెప్పుకొచ్చారు నరేష్. ఒక పోలీస్ ఆఫీసర్ సహాయంతో తన ఫోన్ హ్యాక్ చేసిందని కూడా ఆయన తెలిపారు.. పొలిటిషన్ పేరు తెరపైకి తీసుకొచ్చి తన బంధువు మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరుతో బెదిరింపులకు దిగింది అని, 10 కోట్ల రూపాయలు ఇస్తే సెటిల్మెంట్ చేసుకుంటానంటూ మధ్యవర్తితో బేరసారాలు చేసింది రమ్య అంటూ తెలిపారు నరేష్.

నరేష్ మాట్లాడుతూ.. తిండి పెట్టేది కాదు.. కొడుకును కొట్టేది.. ఫంక్షన్ ఏదైనా సరే జరిగితే తాగి రచ్చ రచ్చ చేసేది. రమ్యకి తనపై కంటే డబ్బు పైన ఎక్కువ ప్రేమ అంటూ అసలు విషయాన్ని తెలిపాడు నరేష్. ప్రస్తుతం రమ్య రఘుపతి గురించి నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version