అనంతపురంలో వాలంటీర్ ఆత్మహత్య సుసైడ్… సీఎం కారణమంటూ లేఖ!

-

అనంతపురంలో వార్డు వాలంటీర్ ఆత్మహత్య లేఖ కలకలం రేపుతోంది. ”నా చావుకు కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగం” అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు వార్డు వాలంటీర్ మహేష్. రాయదుర్గం పట్టణం లోని నాల్గవ సచివాలయం తొమ్మిదో వార్డులో వార్డు వాలంటీర్ గా ఉన్న మహేష్… రెండు రోజుల క్రితం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే.. సుసైడ్‌ చేసుకున్న వార్డు వాలంటీర్ మహేష్ లేఖ మాత్ర సామాజిక మాధ్య మాల్లో వైరల్ అవుతోంది. వాలంటీర్ల తో గొడ్డు చాకిరి చేయించుకుంటున్నారని… మూడు పూటల వాలంటీర్లు అన్నం తినగలుగుతున్నారా ? లేఖ లో ప్రశ్నించాడు వార్డు వాలంటీర్ మహేష్. ఏపీ లో ఉన్న వార్డు వాలంటీర్ల సమస్యలపై వార్డు వాలంటీర్ మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. నా లాంటి పరిస్థితి మరొక వాలం టీర్ కు రాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూడాలంటూ వేడుకున్నాడు వార్డు వాలంటీర్ మహేష్.

Read more RELATED
Recommended to you

Latest news