ఆ నిర్మాత డైలాగ్‌తో వినాయ‌క్ హ‌ర్ట్‌

-

ఒక్క విజ‌యం కోసం ఐదేళ్లుగా బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర‌లు చేస్తున్న బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎట్ట‌కేల‌కు రాక్ష‌సుడు సినిమాతో హిట్ కొట్టాడు. కోలీవుడ్‌లో హిట్ అయిన రాట్సాస‌న్ సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమా హిట్‌ను ప్ర‌స్తుతం బెల్లంకొండ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ‘రాక్షసుడు సినిమాతోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేక్షకులకు నటుడిగా పరిచయం అయ్యాడు..” అంటూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపాయి.

ఈ వ్యాఖ్య‌లు ముఖ్యంగా ద‌ర్శ‌కుడు వివి.వినాయ‌క్‌ను బాగా హ‌ర్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. బెల్లంకొండ నిర్మించిన ఆది సినిమాతోనే వినాయ‌క్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఆ త‌ర్వాత అదే వినాయ‌క్ శీనును హీరోగా ప‌రిచ‌యం చేస్తూ అల్లుడు శీను సినిమా తీశారు. ఆ సినిమా ఓవ‌ర్ బడ్జెట్ కార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేదు. ఈ సినిమా విష‌యంలో వినాయ‌క్ చేసిందంతా చేశాడు… బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు.

ఆ సినిమా త‌ర్వాత శీను చాలా సినిమాలే చేసినా ఏ ఒక్క‌టి హిట్ అవ్వ‌లేదు. మ‌ధ్య‌లో బోయ‌పాటి జ‌య‌జాన‌కీ నాయ‌క సినిమా చేశాడు. ఆ సినిమా కూడా బాగున్నా ఓవ‌ర్ బ‌డ్జెట్‌తో క‌మ‌ర్షియ‌ల్ హిట్ అవ్వ‌లేదు. ఇక క‌వ‌చం, సీత లాంటి డిజాస్ట‌ర్ల‌తో బెల్లంకొండ మార్కెట్ పూర్తిగా ప‌డిపోతోన్న టైంలో రాక్ష‌సుడు వ‌చ్చి బెల్లంకొంకు తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్ ఇచ్చింది.

ఈ సినిమా హిట్ ఇచ్చిన జోష్‌లో బెల్లంకొండ చేసిన వ్యాఖ్య‌ల‌పై మిగిలిన ద‌ర్శ‌కులు స్పందించ‌క‌పోయినా వినాయ‌క్ మాత్రం బాగా హ‌ర్ట్ అయ్యి స్పందించిన‌ట్టు టాక్‌. ‘అల్లుడుశీను’ కోసం చేయాల్సిందంతా చేశామని, ఇప్పుడు ఇలా మాట్లాడటం బాగోలేదన్నట్టుగా వినాయక్ రియాక్ట్ అయ్యాడ‌ట‌. మ‌రి బెల్లంకొండ సురేష్ అయినా ఈ మాట మాట్లాడేట‌ప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాల్సి ఉండాల్సింది.

Read more RELATED
Recommended to you

Latest news