వరంగల్ NIT విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిట్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హైదరాబాద్ – కొత్తపేటకు చెందిన హృతిక్ సాయి (22) బుధవారం నుండి కనిపించకుండా పోయాడు. దీంతో బుధవారం తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం కాలేజీ సమీపంలోని వడ్డేపల్లి చెరువులో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం హృతిక్ సాయిదే అని గుర్తించిన తోటి విద్యార్థులు గుర్తించారు. మార్కులు తక్కువగా రావడంతో హృతిక్ సాయి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.