దిల్ రాజు కు గట్టి వార్నింగ్ ఇచ్చారా..!! అందుకే?

-

ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  స్టార్ హీరో దళపతి విజయ్ తో మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ముందు జనవరి 12 విడుదల కు ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ను 14 తేది కి వాయిదా పడింది.దానికి దిల్ రాజు మాట్లాడుతూ అందరూ నా పై పడి ఏడుస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు.

ఏమాంటూ ఈ సినిమా మొదలు పెట్టారో గాని దిల్ రాజు చేతలు మాటలు అన్నీ వివాదాలకు దారితీస్తున్నాయి.ఈ సినిమా పై ఇప్పుడు బోలెడంత నెగిటివ్ ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం దిల్ రాజు 250 కోట్లు పైగానే ఖర్చు పెట్టారు. రకరకాల కారణాలు వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు సినిమా కూడా తెలుగు లో రెండు రోజులు ఆలస్యంగా థియేటర్స్ లోకి అడుగుపెడుతోంది. కాని తమిళంలో లో మాత్రం అదే డేట్ ఫిక్స్ అయింది.

ఇక దిల్ రాజు ఇలా వెనక్కి తగ్గటానికి పలు కారణాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా చిరంజీవి, బాలయ్య బాబు లు గాట్టిగా వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా బాలయ్య బాబు అచ్చ తెలుగు సినిమాకు థియేటర్స్ లేకుండా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారని ప్రచారం వుంది.. దీనికి దిల్ రాజు వ్యతిరేక వర్గం ఇద్దరు హీరోలకు సమాచారం ఇచ్చారట. గతంలో ఆయన చేసిన మొదట తెలుగు సినిమాలే అన్న మాటలు కూడా బయటకి తెచ్చి మంట పెట్టారట. అందుకే దిల్ రాజు అందరూ నా మీద పడి ఏడుస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news