మేము నాయకులం కాదు సేవకులము : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

-

మంత్రి పొంగినేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చుతామని హామీ ఇచ్చారు.మేము నాయకులం కాదు సేవకులమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కలిసి నిర్వహించిన కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేసిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యాన్ని కాంక్షిస్తూ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశారని వెల్లడించారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన గ్యారంటీలను తప్పకుండా నెరవేర్చుతామని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే….ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. బడుగువర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని, వీటి పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనన్నారు. ఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకే ఈ ఇళ్లను అందజేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news