‘మేము సిద్ధం.. బూత్ సిద్ధం’……సీఎం జగన్ ప్రకటన

-

మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను సీఎం జగన్ సమాయత్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరవేయాలని.. ఇందుకోసం జరిగిన మంచిని ప్రజలకు వివరించాలని సూచించారు.వైసీపీ పార్టీ నేతలతో ఈ రోజు నిర్వహించిన ‘మేము సిద్ధం.. బూత్ సిద్ధం’ వర్క్ షాప్ లో సీఎం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….’రానున్న 45 రోజులు చాలా కీలకం. చిన్న మార్పులు తప్ప.. ఉన్న ఇన్ఛార్జ్ అభ్యర్థులుగా ఉంటారు.

ఓటర్లను ఎన్నికలలోపు కనీసం ఐదారుసార్లు కలవాలి అని తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేయాలి’ అని సూచించారు.ఈ నేపథ్యంలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రజలకు చేసిన మంచి పనుల గురించి చెప్పాలని తెలిపారు. అలాగే రాబోయే రెండు నెలలు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని సీఎం వైఎస్ జగన్ అని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news