కేజీఎఫ్ 2 ఈ ఇయర్ రావడం అనుమానమేనట ..?

-

కేజీఎఫ్ తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా రికార్డ్స్ సాధించింది. ఈ సినిమాతో కన్నడ స్టార్ హీరో యశ్ ప్రభాస్ మాదిరిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కేవలం ఒక్క సినిమాతో ఈ రేంజ్ క్రేజ్ రావడం అన్నది అందరి హీరోలకి సాధ్యం కాదు. టాలీవుడ్ ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ తనయుడు నిర్మించిన ఈ సినిమాతో యశ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరి ప్రశంసలు దక్కించుకున్నాడు.

 

ఇక ఈ సినిమా రిలీజైన అన్నీ బాషలలో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లాంటి వాళ్ళు ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తామని డేట్స్ ఇస్తామని చెప్పడం విశేషం. కేజీఎఫ్ సినిమా కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 నిర్మించాలని అప్పట్లోనే మేకర్స్ డిసైడయ్యారు. అందులో భాగంగానే మేకర్స్ హీరో యశ్ తో కేజీఎఫ్2 ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా అక్టోబర్ 23న విడుదల చేయడానికి మేకర్స్ ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. అయితే అది సాధ్యమ కావడం లేదని తాజా సంచారం.

ఇక కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ విలన్ గా నటిస్తుంన్నాడట. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ప్రధాని పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నారట. ఇక ఈ సినిమా భారీగా అంచనాలు నెలకొన్నప్పటికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకి అంతటి క్రేజ్ ఉంటుందా అన్నది కాస్త అనుమానమే. అయితే ఎలాగో ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతుంది కాబట్టి కనీసం మరో రెండు నెలలు వెనక్కి జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ప్రమోషన్స్ తో గ్యారెంటీగా పార్ట్ వన్ కి వచ్చినదానికంటే ఎక్కువ క్రేజ్ వచ్చేలా ప్లాన్ చేయాలని యూనిట్ అనుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news