ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. రుణమాఫీ పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

-

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించారు. నాగార్జున సాగర్ సుంకిశాల వద్ద పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు దఫాల్లో రుణమాఫీ చేశామని పేర్కొన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం.. ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు లక్షన్నర రుణం ఉన్న వారికి నేరుగా వారి అకౌంట్ లో డబ్బులు వేశామన్నారు. 5లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది చేకూరిందని తెలిపారు. రెండు దఫాలు కలిపి 12వేల 289 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్టు లెక్కలు చెప్పారు. ఆగస్టు 15న మూడో విడుత రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఆగస్టు లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news