జూలై 5వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి తలసాని

-

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జూలై 5 వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కల్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4వ తేదీన ఎదుర్కోళ్ళు, 5వ తేదీన కళ్యాణం, ఆరవ తేదీన రథోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు.

అమ్మవారి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలలో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అమ్మవారి కళ్యాణం, బోనాలు ఇతర అన్ని వర్గాల పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కల్యాణానికి నగరం నుండే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version