5 లక్షల ఓట్లు ఏమయ్యాయి..కేసులు పెడతా: కేఏ పాల్

-

పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి, అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి కుండ గుర్తుపై పోటీ చేసిన కేఏ పాల్‌కి షాక్ తగిలింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ రియాక్ట్ అయ్యారు. తన తండ్రితో పాటు 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు కేవలం 4 ఓట్లే పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

సీసీటీవీలను ఏర్పాటు చేయలేదని, తనకు వచ్చే 5 లక్షల ఓట్లు ఏమయ్యా యని, తన కుటుంబ సభ్యుల ఓట్లు ఎక్కడికెళ్లాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రశ్నించారు. ఈ దరిద్రపు ఎన్నికలు అక్కర్లేదని, తనకు 8 చోట్ల సున్నా ఓట్లు పడ్డాయని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కోర్టుకెళతానంటూ ఆయన మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఇదిలా ఉంటే… ఏపీలో కూటమి లోక్సభ ,అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. వైసిపి మాత్రం భారీ విజయాన్ని మూట కట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news