చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి సీఎం రేవంత్ రెడ్డి కంగ్రాట్స్

-

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో కూటమి అభ్యర్థులు దాదాపు 164 స్థానాల్లో విజయం సాధించారు. వైసీపీ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో  టీడీపీ అధినేత చంద్రబాబు కి, జనసేనాని పవన్ కళ్యాణ్ కి కంగ్రాట్స్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy

ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిస్కరించుకుంటూ. అభివృద్ధి పథం వైపు సాగుదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక తెలంగాణలోని 17  పార్లమెంట్ సెగ్మెంట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 08, బీజేపీ 08, ఎంఐఎం 1 స్థానాల్లో విజయం సాధించాయి. 

Read more RELATED
Recommended to you

Latest news