పరుచూరి వెంకటేశ్వరరావుకు అసలేమైంది?..ఎందుకలా అయిపోయారు..క్లారిటీనిచ్చిన గోపాలకృష్ణ..

-

తెలుగు చిత్రసీమలో స్టార్ రైటర్స్‌గా ఉన్న పరుచూరి బ్రదర్స్ గురించి అందరికీ తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకుని ఇటీవల యంగ్ హీరోల వరకు అందరికీ వీరు ఎన్నో సినిమాలకు స్టోరిలు అందించారు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో వీళ్లు రాసిన డైలాగ్ లు బాగా పేలాయి. ఈ పరుచూరి సోదరులలో పెద్దవారైన వెంకటేశ్వరరావు సినిమా కథా రచయితగా మాత్రమే కాకుండా నటుడిగానూ రాణించారు. అన్నదమ్ములిద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇటీవల పరుచూరి వెంకటేశ్వరరావు తో దిగిన ఫొటోను డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. అందులో 77 ఏళ్ల పరుచూరి వెంకటేశ్వరరావు బక్క పలుచగా కనబడుతున్నాడు.

అది చూసి జనాలు, ఆయన అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావుకు ఏమైందని అడుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగానే ఈ మేరకు ప్రశ్నలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ చానల్ లో ఈ విషయాలపై క్లారిటీనిచ్చాడు.

తన అన్నయ్యకు ఏం కాలేదని, బాగానే ఉన్నాడని, 2017లో ఆస్ట్రేలియా వెళ్లినపుడు హెల్త్ ఇష్యూస్ వచ్చాయని తెలిపాడు గోపాలకృష్ణ. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం కోసం వెంకటేశ్వరరావు వెయిట్ లాస్ అయ్యాడని, పది కిలోలు తగ్గాడని వివరించాడు.

ఆయన మేధస్సు మాత్రం తగ్గదని పేర్కొన్నాడు. ఫొటో ఎందుకు షేర్ చేశావని తాను దర్శకుడు జయంత్ ను అడిగానని, అప్పుడు ఆయన వయసు మీద పడ్డాక ఇంకెలా ఉంటారని అన్నాడని తెలిపాడు గోపాలకృష్ణ. శరీర ధర్మాల ప్రకారం వృద్ధాప్యంలో వెంకటేశ్వరరావు అలా ఉన్నారని గోపాలకృష్ణ స్పష్టతనిచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news