ఇక్కడ జరుగుతోంది ప్రజా పాలన కాదు.. నయవంచన పాలన : బాల్క సుమన్

-

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ..ప్రజలు మోస పోవడానికి సిద్దంగా అంటారు.. ప్రజలున్నది తమ లాంటి రాజకీయ నాయకుల చేతిలో మోసపోవడానికే అని ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డే చెప్పాడు అని గుర్తు చేశారు.పచ్చి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి అని పిలుపునిచ్చారు.

25 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆ డబ్బులను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు, పొంగులేటి కాంట్రాక్టు ఖాతాలోకి వెళ్లాయి అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుందో రేవంత్ రెడ్డి మీడియాకు డైరెక్ట్ చెప్పొచ్చు కదా.. చెప్పకుండా ప్రతి రోజు ఏదో ఒక లీక్ చేస్తూ పబ్బం గడుపుతున్నారు అని మండిపడ్డారు.రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. నీళ్ళు లేక అవస్థలు పడుతుంటే వీటిని పట్టించుకోకుండా అటెన్షన్ డైవెర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తుండు అని ధ్వజమెత్తారు. ఇక్కడ జరుగుతోంది ప్రజా పాలన కాదు.. నయవంచన పాలన,  జరుతోంది.. తెలంగాణ సంపద అంతా డిల్లీకి చేర వేస్తుండు అని బాల్క సుమన్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news