తొలిసారి షారుఖ్‌ ఖాన్ ను కలిసినప్పుడు అతనెవరో తెలియదు: ఎరిక్‌ గార్సెట్టీ

-

అమెరికా దౌత్యవేత్త ఎరిక్‌ గార్సెట్టీ 2023 మేలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌ను తాను మొదటిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. మొదటిసారిగా తాను షారుఖ్‌ ఖాన్ ను కలిసినప్పుడు అతనెవరో తెలియదని అనంతరం తన మిత్రుల ద్వారా షారుఖ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి తెలుసుకున్నానని వెల్లడించారు.

ఇటీవల ఓ వార్తాసంస్థతో ముచ్చటిస్తున్న సమయంలో గార్సెట్టీ బాలీవుడ్ కింగ్ ఖాన్ కలిసిన విషయం గుర్తు చేసుకున్నారు. ”నేను ఫారుఖ్‌ను ముంబయిలోని అతడి నివాసం మన్నత్‌లో మొదటిసారి కలిసినప్పుడు మేము క్రికెట్ గురించి చర్చించుకున్నాం అని తెలిపారు. ఎందుకంటే ఆయన లాస్‌ ఏంజిల్స్‌ జట్టులో ఓ భాగానికి యజమానిగానే నాకు తెలుసు అని అన్నారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను చూసినప్పుడు మా కార్యాలయంలోని వారంతా ఆశ్యర్యపోయారు అని ఎరిక్‌ గార్సెట్టీ అన్నారు. మీరు ఎవరిని కలిశారో తెలుసా.. అతను ఇండియాలోని ప్రముఖ నటుల్లో ఒకరు అని చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను అని అన్నారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న పాపులారిటీని, ఫ్యాన్స్ ను చూసి షాక్‌ అయ్యాను.”అని పేర్కొన్నారు. 2023 మేలో షారూఖ్‌ను, ఎస్‌ఎస్‌ రాజమౌళిని కలిసినట్లు అప్పట్లోనే గార్సెట్టీ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో వారితో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news