పుష్ప: రెండు భాగాల ఆలోచన ఎందుకు వచ్చిందంటే..?

-

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా వస్తుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై అధికారికంగా ప్రకటన రానప్పటికీ వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఐతే విచిత్రమేమిటంటే ఈ విషయంపై చిత్రనిర్మాతలు అస్సలు స్పందించలేదు. దీంతో పుష్ప సినిమా రెండు భాగాలుగా నిజంగానే వస్తుందా లేదా అన్న అనుమానం అభిమానుల్లో కలుగుతుంది.

ఐతే సుకుమార్ ఆలోచనల్లో రెండు భాగాలుగా తీద్దామనే ఉందట. సినిమా కోసం ఎంతగానో పరిశోధించిన సుకుమార్, రెండు భాగాలుగా తీస్తే బాగుంటుందని అనుకున్నాడట. ఈ మేరకు అల్లు అర్జున్ కి వినిపించాడట కూడా. ప్రస్తుతం వీరిద్దరి మధ్యలో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అన్నీ కుదిరితే రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఐతే అప్పట్లోగా అసలు రెండు భాగాలు అన్న కాన్సెప్టుపై జనాలెలా స్పందిస్తారన్నది తెలుసుకోవడానికి ఇలా క్లూ వదిలారట. మరేం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news