కూరగాయలు తెస్తానని వెళ్లిన భార్య…ప్రియుడితో పరార్

-

బీహార్ రాష్ట్రం ఖగారియా పరిధి మాదర్ గ్రామానికి చెందిన బబ్లు కుమార్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.వీరికి పదేళ్ల క్రితం వివాహమైంది.అయితే చోటి తెలుంచా అనే గ్రామానికి చెందిన సమిత్ కుమార్ అనే వ్యక్తి..బబ్లు కుమార్ భార్య కు పరిచయం అయ్యాడు.వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేత సంబందానికి దారి తీసింది.సమిత్ కుమార్ కూడా పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయినా ఇద్దరూ కుటుంబ బాధ్యతలు మరచిపోయి..తరచూ కలుస్తూ ఉండేవారు.అంతటితో ఆగకుండా ఇటీవల పారిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.ఏప్రిల్ 20న కూరగాయలు తీసుకొస్తానని బబ్లు కుమార్ భార్య ఇంటి నుంచి వెళ్ళింది.రాత్రయినా ఇంటికి రాకపోవడంతో బబ్లూ కుమార్ కంగారుపడి తెలిసిన వారి వద్ద విచారించాడు.

అయినా ఆచూకీ లభించలేదు.ఈ క్రమంలో సమిత్ కుమార్ నుంచి బబ్లు కు ఫోన్ వచ్చింది.”మీ భార్య, నేను గుజరాత్ పారి పోతున్నాం.ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం” అని చెప్పడంతో బబ్లు షాక్ అయ్యాడు.తర్వాత మంగళవారం సమిత్ కుమార్ మోర్ఖాహి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.ప్రేమికులు ఇద్దరినీ గ్రామానికి తీసుకు వచ్చినపెద్దలు అందరి ముందు విచారించారు.ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.అయితే ఇందుకు బబ్లు కుమార్ ఒప్పుకోవడంతో అందరి సమక్షంలో ప్రేమికులు ఇద్దరికీ పెళ్లి చేశారు.ఈ సమయంలో బబ్లు ముగ్గురు పిల్లలు తమ తల్లిని వద్దని వేడుకున్నారు.అయినా మనసు కరగని మహిళ ప్రియుడితో పాటే వెళ్ళిపోయింది.ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version