విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి

-

విద్యా రంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం శాసనమండలిలోని చైర్మన్ ఛాంబర్‌లో ఆయనతో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఆ సమయంలో మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పింగిళి మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏలు, బిల్లుల చెల్లింపు, మెరుగైన పీఆర్సీ వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి పరిష్కరిస్తానని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు హెల్త్ కార్డుల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news