మందుబాబులకు బిగ్ షాక్.. ఇవాళ, రేపు వైన్ షాపులు బంద్

-

హైదరాబాద్‌లో నేడు గణేష్‌ నిమజ్జనం జరుగనుంది. ఈ నేపథ్యంలోనే మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ, రేపు వైన్స్‌లు బంద్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ మహానగరంలో రెండు రోజులపాటు మద్యం షాపులు మూతపడనున్నాయి.

మద్యం షాపులు తిరిగి ఆదివారం రోజున ప్రారంభం కానున్నాయి. ఇది ఇలా ఉండగా… హైదరాబాద్ లోని హుస్సేన్‌ సాగర్‌ దగ్గర భారీ ఏర్పాట్లు.. చేశారు. అటు రేపు ఉదయం వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో నేడు సెలవుగా ప్రకటించింది ప్రభుత్వం.

ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనం ఉన్న నేపథ్యంలో మెట్రో సేవలను కూడా ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. రోజు వారిలా కాకుండా ఈ మెట్రో సేవలు ఇవ్వాళ అర్ధరాత్రి రెండు గంటల వరకు కొనసాగలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version