ఏపీ మంత్రి ఇంటి ముందు యువతి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..

-

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పినిపె విశ్వరూప్‌‌.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన గెలుపొందారు. అయితే మంత్రి పినిపె విశ్వరూప్‌ ఇంటి ముందు యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఓ యువతి పురుగుల మందు తాగడంతో అక్కడున్న వారంతా షాక్‌కు లోనయ్యారు.

దీనికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. న్యాయం చేయాలంటూ మంత్రికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన యువతి మంత్రి విశ్వరూప్‌ ఎదుటే పురుగుల మందుతాగినట్లు తెలిసింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news