స్త్రీలు ఈ పొరపాట్లు చేయకూడదు.. దరిద్రం వస్తుంది..!

-

స్త్రీలు కొన్ని పొరపాట్లు చేయకూడదు స్త్రీలు కనుక ఈ పొరపాటు చేసినట్లయితే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. ఆ ఇంట నిత్యం సమస్యలే ఉంటాయి తప్ప ఆనందం ఉండదు. ఇంట్లో మంచి జరగాలన్న లక్ష్మీదేవి ఉండాలన్నా శుక్రవారం నాడు లేదంటే మొదటిసారి జీతం వచ్చిన వెంటనే మీరు ఉప్పుని కొనుగోలు చేయండి. ఉప్పుని తెచ్చి ఇంట్లో పెట్టండి. అలా చేయడం వలన మీ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు. డబ్బులు వస్తూనే ఉంటాయి సంపద పెరుగుతూ ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట నిత్యం కొలువై ఉంటుంది.

అలానే ఎప్పుడు కూడా ఇంట్లో భోజనం తినే ముందు కాకికి మొదటి అన్నం పెట్టండి తర్వాత తినేసాక కుక్కకి భోజనం పెట్టండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతా మంచే జరుగుతుంది. ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. మంగళవారం నాడు పురుషులు ఇంట్లో క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం మంచిది కాదు స్త్రీలు ఈ తప్పు జరగకుండా చూసుకోవాలి.

రాత్రిపూట స్త్రీలు గాజులు తీసేయకూడదు అలానే చెవులీలు కూడా తీసేయకూడదు ఇటువంటివి చేస్తే దరిద్రం పట్టుకుంటుంది. ఉప్పు చింతపండు మిరపకాయలు కారం వంటివి చేతులకి ఇవ్వకూడదు. వాటిని కింద పెట్టి తీసుకో మనాలి తప్ప చేతికి ఇవ్వకూడదు. స్త్రీలు ఎప్పుడు నల్లని వస్త్రాలని కట్టుకోకూడదు అలా చేయడం వలన దుఃఖం బాధ కలుగుతాయి ఇలా ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకున్నట్లయితే సంతోషం ఉంటుంది లేదంటే అనవసరంగా బాధలు ని ఎదుర్కోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news