WORLD CUP 2023 :వార్మ్ అప్ మ్యాచ్ లు సరే… మెయిన్ మ్యాచ్ లకు వర్షాలు పడితే !

-

నిన్నటి నుండి ఇండియా వేదికగా వరల్డ్ కప్ మెయిన్ మ్యాచ్ లకు అన్ని జట్లకు పరిస్థితులు అనుకూలించడానికి వార్మ్ అప్ మ్యాచ్ లను ఆడిస్తున్నారు. అందులో భాగంగా నిన్న మూడు మ్యాచ్ లు జరగాల్సి ఉండగా, కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే జరుగగా .. ఆఫ్గనిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్య తిరువనంతపురం లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే రద్దు అయింది. ఇక ఈ రోజు వార్మ్ అప్ షెడ్యూల్ లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ లు గౌహతి వేదికగా మరియు ఆస్ట్రేలియా నెదర్లాండ్ లు తిరువనంతపురంలో ఆడాల్సి ఉండగా ఇంతవరకు మ్యాచ్ లు స్టార్ట్ కాలేదు. రెండు చోట్ల వర్షం పడుతుండడంతో ఫ్యాన్స్ చాలా నిరాశతో ఉన్నారు.

ఇప్పుడు అందరి నాట్ అవినిపిస్తున్న మాట వార్మ్ అప్ మ్యాచ్ లు సరే, మెయిన్ మ్యాచ్ లకు ఇలాగే వర్షం కారణంగా రద్దు అయితే పెద్ద జట్ల పరిస్థితి తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఏమి జరగనుందో తెలియాలంటే నాలుగు రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news