రామరాజ్యం కన్నా రాక్షస రాజ్యం పైనే జగన్ కి మక్కువ – యనమల

-

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. రామరాజ్యం కన్నా రాక్షస రాజ్యం పైనే సీఎం జగన్ కి మక్కువ ఎక్కువని అన్నారు. అందుకే ఒంటిమిట్ట రాముల వారి కల్యాణానికి వెళ్లలేదని అన్నారు యనమల. జనం ఆయనని నమ్మడం లేదనే జగన్ మళ్లీ జిత్తులు ప్రారంభించారని అన్నారు.

దేశంలోనే జగన్ అంతా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఇంకా ఎక్కడ ఉండడని, లేడని అన్నారు. సొంత పార్టీలోనే అంతర్గత తిరుగుబాటులతో జగన్ కి దిక్కు తోచని పరిస్థితి నెలకొందన్నారు. ఆంధ్రప్రదేశ్ పంజాబ్ లాగా మారిందనడానికి ప్రధాని మోదీ వ్యాఖ్యలే నిదర్శనం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version