ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటిన యశశ్వి జైస్వాల్

-

టీమిండియా యువ బ్యాట్స్ మెన్ యశస్వి జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా అవసరం పనిలేదు. జట్టులో స్థానం పొందిన కొన్నాళ్లకే పూర్తి స్థాయి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైస్వాల్ ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న టెస్టుల్లో చెలరేగి ఆడాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 236 బంతులలో జైస్వాల్ 14 ఫోర్లు, 12 సిక్సులతో 214 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

దీంతో యశస్వీ జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. ఏకంగా 14 ర్యాంకులు ఎగబాకి టాప్-15 బ్యాటర్గా నిలిచారు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేయడంతో జైస్వాల్ రేటింగ్ అమాంతం పెరిగింది. వచ్చే టెస్టు మ్యాచుల్లోనూ అద్భుతంగా ఆడి ఐసీసీ ర్యాంకుల్లో టాప్-10లోకి చేరాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news