Breaking : గుడివాడలో ఎన్టీఆర్‌ విగ్రహానికి వైసీపీ రంగులు

-

గుడివాడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేశారు. అయితే ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరుగుతన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు మహానాడు జరిగే అంగులూరుకు కిలోమీటరు దూరంలోనే బొమ్ములూరు ఉంది. బొమ్ములూరుకు చేరుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, పిన్నమనేని వెంకటేశ్వరరావు లు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న వైసీపీ రంగులు చెరిపేసి టీడీపీ నేతలు పసుపు రంగులు వేశారు.

టీడీపీ నేతలు వెళ్లిన తర్వాత, బొమ్మలూరు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేశారు. దీంతో.. బొమ్ములూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా.. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మహానాడు బ్యానర్లపై, అధికార పార్టీ నేతల బ్యానర్లు వేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version