బ్రేకింగ్: సిబిఐ విచారణకు నేను రెడీ: అంబటి

-

తనపై దాఖలు చేసిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై అంబటి రాంబాబు కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. తనపై పిటీషన్ వేసిన ఇద్దరూ కూడా అక్రమ మైనింగ్ లో దొంగలు అని, ఇద్దరిదీ ఒకే పంచాయితీ అని అన్నారు. తనపై పిటీషన్ దాఖలు చేసారు కాబట్టి తాను రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసినా, కేంద్ర ప్రభుత్వం విచారణ చేసినా, సిబిఐ విచారణ చేసినా సరే సిద్దంగా ఉన్నా అని స్పష్టం చేసారు.

నాపై వస్తున్న ఆరోపణలకు దేనికి అయినా తాను సిద్దంగా ఉన్నా అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఎవరు అయినా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయవచ్చు అని, అందులో భాగంగానే ఈ పిటీషన్ దాఖలు చేసారని అన్నారు. అటు విపక్షంపై కూడా అంబటి విమర్శలు చేసారు. హైదరాబాద్ ని వదిలి చంద్రబాబు రావడం లేదని, నారా లోకేష్ ట్విట్టర్ ని వదిలి రావడం లేదని, చంద్రబాబు జూమ్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version