వైసీపీ ఎంఎల్ఏ కి వడదెబ్బ.. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు..!

-

ఆంధ్రప్రదేశ్ లో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో  రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నాయకులు ఎండను సైతం లెక్క చేయకుండా తమ తమ నియోజకవర్గాల్లో ముమ్మరంగా గడపగడపకు ప్రచారం చేస్తూ.. ముందుకు వెళ్తున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు ఉదయం అల్ఫాహారం తీసుకున్నప్పటి నుంచి మొదలు.. మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఎక్కడో ఒకచోట కానిచ్చేస్తున్నారు. అర్థరాత్రి వరకు ప్రచారం నిర్వహించి ఇంటికి చేరుకుంటున్నారు.

ఈ తరుణంలోనే ఇవాళ కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన వడదెబ్బ తగిలిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆయనకు మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ లో విజయవాడకు తరలించినట్టు సమాచారం. ఎండకు అత్యవసరం అయితే తప్ప బయటికీ వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బకు గురవ్వకుండా జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version