చంద్రబాబు ప్రతిపక్ష నేత, పనికిమాలిన నాయకకుడా ?.. ఎమ్మెల్యే రోజా

-

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై లేడీ ఫైర్ బ్రాండ్‌, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా నిప్పులు చెరిగారు. అమరావతి అనే భ్రమలో ప్రజలను మోసంచేసి కేవలం గ్రాఫిక్స్‌తోనే ఐదేళ్లు కాలంగడిపారని మండిపడ్డారు. చంద్రబాబు విజన్‌ 2020 ఏంటో అమరావతి కుంభకోణంతోనే తేటతెల్లమైందని రోజా అన్నారు. అంతేకాకుండా.. చంద్రబాబు ప్రతిపక్ష నేత, పనికిమాలిన నాయకకుడా ? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ విమర్శలు చేశారు. చట్టసభల్ని అడ్డుకోవడమే చంద్రబాబు విజనా ? అలజడులు సృష్టించడమే చంద్రబాబు విజనా? అంటూ ప్రశ్నించారామె.

చంద్రబాబుది 420 విజన్‌ అని ఎద్దేవా చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో భూములు దోచుకున్నారని రోజా ఆరోపణలు చేశారు. చంద్రబాబు, టీడీపీకి పుట్టగతులు లేకుండా పోతాయన్నారు. రైతులు ముసుగులు టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమి లేదన్నారు రోజా. చంద్రబాబు విజన్ ఏంటో ఇప్పుడు తేటతెల్లమైందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version