ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైసీపీ ఎమ్మెల్యే…!

-

టీడీపీ పేరు చెప్తే వైసీపీకి పైకి చెప్పలేని కోపం. అసలు టీడీపీ ప్రస్తావన తీసుకుని రావడానికి కూడా వైసీపీ నేతలు ఇష్టపడే పరిస్థితి ఉండదు. అలాంటిది వైసీపీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అసలు జరిగింది ఏంటీ అనేది చూస్తే…

తెనాలిలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శిధిలావస్థలో ఉండటం గమనించారు. స్థానిక గాంధీచౌక్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయన కొత్త విగ్రహం ఏర్పాటు చేయించి ఆవిష్కరించారు. ఆయనే స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆసక్తికర విషయం ఏంటీ అంటే ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు. బీసీ నేతలు కూడా హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version