లోకేష్ పరమశుంఠ.. శవాలు కనిపిస్తే రాబందులాగా వాలిపోతాడు : వైసీపీ ఎంపి

-

తాడేపల్లి : టిడిపి నేత నారా లోకేష్ పై వైసీపీ ఎంపి నందిగం సురేష్ నిప్పులు చెరిగారు. డెడ్ బాడీ కనిపిస్తే లోకేష్ రాబందులాగా వాలిపోతాడని.. బూతులు తిడుతుంటే హీరో అయిపోతాను అనుకుంటున్నాడని మండిపడ్డారు ఎంపి నందిగం సురేష్. పిచ్చి వర్కవుట్ లు చేసి బాడీ వెయిట్ తో పాటు బుర్ర వెయిట్ కూడా తగ్గిందన్నారు. లోకేష్ కు తన తండ్రి హయాంలో దళితుల పై జరిగిన దాడుల సంగతి తెలుసా ? అని నిలదీశారు.

కారంచేడు సంఘటన ఎవరి హయాంలో జరిగిందో లోకేష్ తెలుసుకోవాలని చురకలు అంటించారు ఎంపి నందిగం సురేష్. నేరస్తుడు ఎలాంటి వ్యక్తి అయినా కఠిన శిక్ష వేయటం ఖాయమని స్పష్టం చేశారు. లోకేష్ బుర్ర తక్కువ వ్యక్తి, పరమశుంఠ అని చురకలు అంటించారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చంద్రబాబు చెప్పిన మాటలు ప్రజలు మరిచిపోలేదని పేర్కొన్నారు. మీడియా ప్రెస్ మీట్ పెట్టడాని కంటే ముందు లోకేష్‌ ఆనందంతో వెకిలి నవ్వులు నవ్వాడని మండిపడ్డారు ఎంపి నందిగం సురేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version