బ్రేకింగ్ : వైఎస్ అవినాష్ రెడ్డి కి కరోనా పాజిటివ్ !

-

ఏపీలో ప్రజా ప్రతినిదులకు కరోనా కలకలం రేపుతోంది. ఈరోజు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొత్త పేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇక కొద్ది సేపటి క్రితం కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైఎస్ వర్ధంతి సంధర్భంగా సెప్టెంబర్1,2 వతేదీలలో కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు.

ఈ పరీక్షల లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. తనకు కరోనా అని నిర్ధారణ కావడంతో వెంటనే ఎంపీ హోమ్ ఐసోలేషన్ కు వెళ్ళిపోయారు. అయితే కొద్ది రోజులుగా అయనతోనే కలిసి తిరుగుతున్న అనుచరులతో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో తన వెంట ఉన్న ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ కోరారు. ఇక ఏపీలో ఒక్క రోజు కూడా పదివేలకు తక్కువగా కేసులు నమోదు కావడం లేదు. రోజూ పదివేల కేసులు నమోదు కావడం టెన్షన్ పెడుతోందని చెప్పచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news