నేడు ఢిల్లీకి రానున్న జగన్.. కేంద్ర మంత్రులతో భేటీ..

-

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 9:50 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10:05కి విమానంలో ఢిల్లీ బయల్దేరతారు. మధ్యాహ్నం 12.20కి ఢిల్లీ చేరుకుని నేరుగా తన అధికార నివాసమైన 1-జన్‌పథ్‌కు చేరుకుంటారు.

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా ఇతర కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. ముందుగా మధ్యాహ్నం అమిత్ షాను కలుస్తారని సమాచారం. రేపు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌‌ తదితరులను కలుస్తారు. రేపు సాయంకాలం జగన్ ఆంధ్రాకు తిరుగుపయనమవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news