పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించిన వైఎస్ షర్మిల

-

తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల.. మరో కీలక ప్రకటన చేశారు. తాను నిర్వహించబోయే పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించారు వైఎస్ షర్మిల. అక్టోబర్ 20 న చేవెళ్ల నుంచి తన పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు వైఎస్ షర్మిల.ఏకంగా 90 నియోజకవర్గాల్లో తన పాదయాత్ర ఉంటుందని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో పార్టీలు అమ్ముడు పోయాయని.. అధికార టిఆర్ఎస్ పార్టీ కి తా మే ప్రత్యామ్నాయమన్నారు.

మొత్తం ఏడాది పాటు తన పాదయాత్ర ఉంటుందన్నారు. వైఎస్ ప్రజా ప్రస్థానం మొదలు పెట్టిన చేవెళ్ల నుంచే యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు షర్మిల. యాత్రలో అస్సలు బ్రేక్ లు ఉండవని.. చేవెళ్ళలో ప్రారంభమై చేవెళ్ళలోనే ముగింపు ఉంటుందని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల. జిహెచ్ఎంసి మినహా అన్ని జిల్లాలు తాకేలా దాదాపు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని.. వైఎస్ఆర్ సంక్షేమపాలన తేవడమే తన లక్ష్యం అన్నారు. పాదయాత్రలోను నిరుద్యోగ వారం లో భాగంగా మంగళవారం దీక్షలు కొనసాగుతాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version