మాది పార్టీయే కాదన్న మీరు దాడులెందుకు చేస్తున్నారు : వైఎస్ షర్మిల

-

తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో తమ పాదయాత్రను సర్కార్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే నిన్నటి పాదయాత్రకు చెందిన ఫ్లెక్సీలు చించేశారని ఫైర్ అయ్యారు. తమ పార్టీ నాయకులపై దాడి కూడా చేశారన్నారు. అక్కడే ఉన్న పోలీసులు కనీసం స్పందించకుండా.. చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

కటికనపల్లిలో పాదయాత్రలో భాగంగానే నైట్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నామని వైఎస్​ షర్మిల తెలిపారు కానీ అక్కడ నైట్ క్యాంపునకు సంబంధించిన టెంట్లను అధికారులు తొలగించడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు టీఆర్ఎస్ నాయకులకు లోబడే పని చేస్తున్నారని ఆరోపించారు.

“ప్రజలలో మాకు ఆదరణ లేదని మీరు అనుకున్నప్పుడు మాపై దాడులు ఎందుకు చేస్తున్నారు. మాకు వస్తున్న ఆదరణను మీరు తట్టుకోలేకనే ఈ దాడులు. మాది పార్టీ కాదని మీరు తీసివేశారు. దాడులు ఎందుకు చేస్తున్నారు. ఎక్కడికి పోయినా మేము స్థానికంగా జరుగుతున్న అవినీతి గురించి, ఎమ్మెల్యే గురించి మాట్లాడాం. వారు దానికి సమాధానం చెప్పకపోగా అందరూ కలిసి నాపై స్పీకర్​కు ఫిర్యాదు చేశారు.” – వైఎస్​ షర్మిల వైతెపా అధ్యక్షురాలు

Read more RELATED
Recommended to you

Exit mobile version