వైఎస్‌ వివేకా హత్య కేసు: గోవాలో మరో కీలక వ్యక్తి అరెస్ట్

-

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్ ను సి.బి.ఐ పోలీసులు అరెస్టు చేశారు. గోవా రాష్ట్రంలో సీబీఐ అరెస్టు చేసింది. ఇవాళ అరెస్టు చేసిన అనంతరం అక్కడి స్థానిక కోర్టులో సునీల్ కుమార్ యాదవ్ సిబిఐ అధికారులు హాజరు పరిచారు.

దాని అనంతరం… గోవా స్థానిక కోర్టు ద్వారా సునీల్ కుమార్ యాదవ్ ను ట్రాన్సిట్ రిమాండ్ లో కడప కు తీసుకు వచ్చారు సిబిఐ అధికారులు. వివేకనంద రెడ్డి.. హత్య కేసులో అనుమానితుడి గా ఉన్న సునీల్ కుమార్ ను ఇప్పటికే సిబిఐ అధికారులు పలుమార్లు విచారణ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ సునీల్ కుమార్ అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు ఈ కేసులో సిబిఐ అధికారుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప కేంద్ర కారాగారం లోని అతిథి గృహంలో వివేకానంద రెడ్డి హత్య కేసు అనుమానితులను అధికారులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news