వైసీపీ ఖాతాలోకి ఏలూరు కార్పొరేషన్

-

ఏలూరు: వైసీపీ ఖాతాలోకి ఏలూరు కార్పొరేషన్ చేరింది. కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోంది. మొత్తం 50 డివిజన్లలో ఇప్పటికే వైసీపీ 28 డివిజన్లలో విజయం సాధించింది. మిగిలిన కార్పొరేషన్లలో కూడా ఓట్ల లెక్కింపు సాగుతోంది. ఈ డివిజన్లలో కూడా వైసీపీ ముందంజలో ఉన్నట్లు సమాచారం. పలుచోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. జనసేన అభ్యర్థులు కూడా ఖాతా తెరిచారు.

ఏలూరు సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 4 సెంటర్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారితో పాటు పురపాలక సంఘం అధికారులు కూడా ఈ ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు.

 

ఇక ఓట్ల లెక్కింపు సందర్భంగా సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాలేజీకి 100 మీటర్ల దూరంలోనే వాహనాలకు అనుమతించారు. అధికారులు అనుమతి ఉంటేనే అభ్యర్థులను ఇతరులను కాలేజీలోకి అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా కాలేజీ సమీపంలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version