రఘురామరాజుకు షాక్ : లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఫిర్యాదు..

-

రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకునేందుకు వైసీపీ రంగం సిద్దమైంది. రఘురామకృష్ణరాజు గత ఏడాది నుంచి ఏపీ సర్కార్ పై అనే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పడిపోవాలని అని కూడా అనేక విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల రఘురామకృష్ణరాజును రాజద్రోహం కేసు కింద  అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తాజాగా రఘురామకృష్ణరాజును డిస్ క్వాలిఫై చేయాలని లోక్ సభ స్పీకర్ కు చీఫ్ విప్ భరత్ ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా మరోసారి లోక్ సభ స్పీకర్ ను కలిసి భరత్ విజ్ఞప్తి చేశారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ కె. రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్  ఓం బిర్లాకు లోక్ సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్ సభ స్పీకర్ కు సమర్పించామని, అనేక పర్యాయాలు డిస్ క్వాలిఫికేషన్ కు సంబంధించి స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version