చంద్రబాబు ఏడుపు అంతా డ్రామా- విజయ సాయి రెడ్డి.

-

చంద్రబాబు నాయుడు ఏడుపు అంతా ఓ డ్రామా.. అని చంద్రబాబును ఎవరూ తిట్టలేదని అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుందని వైఎస్సార్ సీపీ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు నాటకాలు ఎవరూ నమ్మరని.. చంద్రబాబు యాక్షన్ కు రియాక్షన ఉంటుందని ఆయన హెచ్చరించారు.

కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని ఆల్ పార్టీ మీట్ లో కేంద్రాన్ని కోరామని విజయ సాయి రెడ్డి అన్నారు. కనీస మద్దతు ధరను 24 పంటలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇదే విధంగా దేశంలో అన్ని పంటలకు మద్దతుధర ఇవ్వాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. అనగారిన బీసీను గుర్తించేందుకు సామాజిక ఆర్థిక కులగణన చేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. మహిళా బిల్లును తీసుకురావాలన్నారు. రాష్ట్రానికి సంబంధించి దిశ బిల్లును ఆమోదించాలని కోరారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యత్ బిల్లులు ఇప్పించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలియజేశారు. జనాభా లెక్కలు తీసేది కేంద్రమే అని.. కులాల వారీగా లెక్కలు తీస్తేనే న్యాయం జరుగుతుందని విజయ సాయి రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version