జాంబీరెడ్డి ట్రైలర్: ఫ్యాక్షన్ డ్రామాకి జాంబీ మేకప్..

-

తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలు చాలా కామన్, సమరసింహా రెడ్డి, ఇంద్ర, జయం మనదేరా… ఇలా ప్రతీ హీరో కూడా అలాంటి సినిమాలు చేసేసారు. ఐతే మొదటిసారి ఫ్యాక్షన్ కథకి సరికొత్త సొబగులద్దే ప్రయత్నం జరుగింది. అ! సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, జాంబీరెడ్డితో ఫ్యాక్షన్ సినిమాని సరికొత్తగా చూపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఈ సినిమా ట్రైలర్ ని వదిలారు. తెలుగులో ఇప్పటి వరకు జాంబీ కథలు రాలేదు.

ఫ్యాక్షన్ కి జాంబీని కలుపుకున్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. కామెడీ టచ్ కూడా అదనపు ఆకర్షణ. కరోనా నుండి మొదలుకుని ఫ్యాక్షన్, ఆ తర్వాత జాంబీ అన్నీ కలిపి ట్రైలర్ ని ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేసాయి. గెటప్ శీనుకి ఈ సినిమాతో నటుడిగా నిరూపించుకునే అవకాశం దక్కిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ప్రతీ సంవత్సరం సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి జాంబీలు వచ్చాయంటూ చెప్పే ఆఖరి డైలాగ్, ఈ సినిమా హాస్యభరితంగా ఉండడంతో పాటు భయం కలిగించేలా ఉందని తెలుస్తుంది. రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version