ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు స్మార్ట్ ఫోన్లు..

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న సైట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ బుధ‌వారం ప్రారంభం కాగా ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లు, యాక్స‌స‌రీలు, ఎల‌క్ట్రానిక్స్ త‌దిత‌ర వ‌స్తువుల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను అందిస్తున్నారు. సేల్‌లో ప‌లు స్మార్ట్ ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

 Flipkart Mobiles Bonanza Sale Discounts on smartphones

సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ మోడ‌ల్‌ను రూ.6901 త‌గ్గింపుతో రూ.40,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే యాపిల్ ఐఫోన్ 11 64జీబీ మోడ‌ల్ రూ.4901 త‌గ్గింపుతో రూ.49,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ఐఫోన్ ఎస్ఈ 2020 రూ.8వేల త‌గ్గింపుతో రూ.31,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది.

సేల్‌లో అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 3, రియ‌ల్‌మి ఎక్స్‌3, మోటోరోలా మోటో జి 5జి, పోకో ఎక్స్‌3, పోకో ఎం2 ప్రొ, రియ‌ల్ మి నార్జో 20 ప్రొ, మోటో ఇ7 ప్ల‌స్‌, రెడ్‌మీ 9 ప్రైమ్‌ స్మార్ట్ ఫోన్ల‌ను కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. ఐసీఐసీఐ కార్డుల‌తో 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news