ఆపద నుంచి రక్షించే సరికొత్త పరికరం… మహిళలకే కాదు అందరికి ఉపయోగమే…! వీడియో

-

శంషాబాద్‌లో దిశ హత్యాచారం తర్వాత… దేశంలో మహిళల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆపదలో ఉన్న వారికి సరైన రక్షణ కరువైంది… నేను కష్టంలో ఉన్నాను సహాయం చేయండి అని కోరిన పాపానికి ఆమెను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసాయి కొన్ని మృగాలు… దీనితో పలువురు మహిళల భద్రత మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇక సాంకేతికతను కూడా ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలని అంటున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా ఒక పరికరం అందుబాటులోకి వచ్చింది…

ఆప్టి సేఫ్ పేరుతో… సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఒక అమ్మాయి రోడ్డు మీద నడిచి వెళ్తుంది… ఈ సమయంలో బండి మీద వచ్చిన… ఇద్దరు ఆకతాయులు ఆమెను బెదిరిస్తారు… వెంటనే తన హ్యాండ్ బాగ్ కి ఉన్న ఆప్టి సేఫ్ అనే పరికరం పైన ఉన్న క్యాప్ ని తొలగిస్తుంది. వెంటనే సైరన్ మోగడంతో పాటు… ఆమె ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కి మెసేజ్ కూడా వెళ్తుంది. అలాగే ఆమె ఉన్న లొకేషన్ తో పాటుగా… నేను ఆపదలో ఉన్నాను అని ఒక సందేశం వెళ్తుంది.  అక్కడ ఉన్న స్థానికులకు కూడా ఈ అలెర్ట్ వినపడుతుంది.

సైరన్ మోగడంతో అక్కడి నుంచి ఆ ఆకతాయి భయంతో పారిపోతాడు. ఇక ఇదే సమయంలో దానికి ఉన్న స్పై కెమెరా అక్కడ ఉన్న జరుగుతున్న మొత్తాన్ని రికార్డ్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఎవరైనా అనారోగ్య సమస్యతో పడిపోయినా సరే అక్కడ వారికి సమాచార౦ వెళ్తుంది. ఈ పరికరాన్ని కొనుక్కోవాలని ఎంతో ఉపయోగకరమని పలువురు సూచిస్తున్నారు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆపద నుంచి బయటపడవచ్చని అంటున్నారు. అయితే ఆ పరికరం ధర ఆన్ లైన్ లో మూడు వేల వరకు ఉంది…!

ఈ కింది లింక్‌లో దాన్ని పొందవచ్చు.
https://www.amazon.in/Optisafe-MyBuddy-Distress-Companion-Tracker/dp/B07PFCYM88/ref=sr_1_2?keywords=optisafe&qid=1575296292&sr=8-2

Read more RELATED
Recommended to you

Latest news