మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్..ధర, స్పెసిఫికేషన్స్..

-

ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా నుంచి బడ్జెట్ రేంజ్ లో మరో స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్ చేశారు.9వేలలోపు ప్రారంభ ధరతో మోటోరోలా ఈ32ఎస్ భారత్‌లో గురువారం విడుదలైంది. ఇప్పటికే ఉన్న ఈఎస్32తో పోలిస్తే కొన్ని మార్పులతో అడుగుపెట్టింది..లేటెస్ట్ ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ కూడా హైలైట్‌గా ఉంది.

 

ఈ ఫోన్ ఫీచర్స్..

6.5 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో మోటో ఈ32ఎస్ వస్తోంది. 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండగా.. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌ ఈ మొబైల్‌ ఉంటుంది. గరిష్ఠంగా 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులోకి వస్తుంది. స్టోరేజ్‌ను పొడిగించుకునేందుకు మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌ను మోటోరోలా ఈ ఫోన్‌లో ఇచ్చింది. ఇక మోటో ఈ32ఎస్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 16 MP ప్రధాన కెమెరా, 2 MP మాక్రో షూటర్, 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వీడియోలు, సెల్ఫీల కోసం 8 MP ఫ్రంట్ కెమెరాను అందించారు..

4జీ ఎల్‌‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ ఫోన్ ధర..

మార్కెట్ లో ఈ ఫోన్ ధర మాములుగా రూ.9,299 కాగా.. ఇంట్రడక్టరీ ఆఫర్‌ కింద రూ.8,999కే సేల్‌కు రానుంది. ఈ ఇంట్రడక్టరీ ధరగా ఎంత కాలం ఉంటుందో మోటోరోలా వెల్లడించలేదు. అలాగే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉన్న టాప్‌ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Moto E32s సేల్‌ మొదలవుతుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రిలయన్స్ డిజిటల్, జియో మార్ట్, జియో మార్ట్ డిజిటల్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.సిల్వర్, స్లేట్ గ్రే కలర్ లో లభించనుంది..

Read more RELATED
Recommended to you

Latest news